ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షెల్టర్ హోంలో దారుణం..రిటైర్డు మహిళా ఎస్ఐపై ఇద్దరి అఘాయిత్యం

ABN, First Publish Date - 2020-05-05T17:05:54+05:30

దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల పంజాబ్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన రైల్వే పోలీసు మాజీ మహిళా ఎస్ఐ (50)పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం జరిపిన దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ షెల్టర్ హోంలో జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిరోజ్‌పూర్ (పంజాబ్): దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల పంజాబ్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన రైల్వే పోలీసు మాజీ మహిళా ఎస్ఐ (50)పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం జరిపిన దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ షెల్టర్ హోంలో జరిగింది. రైల్వే పోలీసు అయిన భర్త మరణించడంతో కారుణ్యనియామకం కింద భార్యకు ఎస్ఐ పోస్టు వచ్చింది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మహిళా ఎస్ఐ జమ్మూలోని వైష్ణోమాత దేవాలయం దర్శనం కోసం బయలుదేరి మార్గమధ్యంలో లాక్ డౌన్ వల్ల మధ్యలో చిక్కుకుపోయారు. తమ జీఆర్పీ పోలీసులు షెల్టరుహోంలో ఉంచగా, అక్కడ ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని మహిళా మాజీ ఎస్ఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-05T17:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising