వేధింపులతో విసిగిపోయిన ఆ తల్లి.. కొడుకుని హత్య చేసి ఆపై..
ABN, First Publish Date - 2020-07-17T16:01:30+05:30
కృష్ణా: బాపులపాడు బొమ్ములూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు వేధింపుల కారణంగా ..
కృష్ణా: బాపులపాడు బొమ్ములూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు వేధింపుల కారణంగా విసిగిపోయిన ఓ కన్నతల్లి రాయిపెట్టి మోది చంపేసింది. మద్యానికి బానిసైన కొడుకు గత కొంతకాలంగా తల్లిని వేధిస్తుండటంతో తల్లి విసుగు చెందింది. ఈ నేపథ్యంలోనే కొడుకు వేధింపులు తీవ్రస్థాయికి చేరటంతో తెల్లవారుజామున కొడుకు కొల్లి బాబి (29)ని నిద్రిస్తున్న సమయంలో రాయితో మోది చంపి.. ఆపై పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఘటన స్థలానికి హనుమాన్ జంక్షన్ పోలీసులు చేరుకున్నారు.
Updated Date - 2020-07-17T16:01:30+05:30 IST