ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒడిశాలో దారుణం

ABN, First Publish Date - 2020-10-15T14:20:02+05:30

తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 17 ఏళ్ల బాలికను పౌల్ట్రీఫాంలో బంధించి 22 రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోళ్లఫారంలో బాలికను బంధించి 22 రోజులుగా అత్యాచారం

కటక్ (ఒడిశా): తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 17 ఏళ్ల బాలికను పౌల్ట్రీఫాంలో బంధించి 22 రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో వెలుగుచూసింది. జగత్ సింగ్ పూర్ జిల్లా తిర్టోల్ గ్రామానికి చెందిన టీనేజ్ బాలిక తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి పారి పోయింది. బాలికను ఇంటికి చేరుస్తానని చెప్పి పౌల్ట్రీ ఫాంకు తీసుకువెళ్లి బంధించి 22 రోజుల పాటు ఇద్దరు వ్యక్తులు ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పౌల్ట్రీ ఫాంపై దాడి చేసి బాలికను రక్షించారు. బాలికను మహిళా సదనానికి తరలించి నిందితుడిని అరెస్టు చశామని పోలీసులు చెప్పారు. 


ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 376(2), 376(2), సెక్షన్ 34ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.మహిళల భద్రత విషయంలో నవీన్ పట్నాయక్ సర్కారు విఫలమైందని బీజేపీ ప్రధాన కార్యదర్శి సమంతింఘర్ ఆరోపించారు. 

Updated Date - 2020-10-15T14:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising