భర్తను చంపి, శవాన్ని దాచిపెట్టిన భార్య
ABN, First Publish Date - 2020-09-23T18:54:48+05:30
ఓ మహిళ తన భర్తతో గొడవపడి అతన్ని చంపి బెడ్ లో దాచి పెట్టిన ఘటన...
జైపూర్ (రాజస్థాన్): ఓ మహిళ తన భర్తతో గొడవపడి అతన్ని చంపి బెడ్ లో దాచి పెట్టిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లా హమీర్ వాజ్ ప్రాంతంలో జరిగింది. హమీర్ వాజ్ గ్రామానికి చెందిన నీరజ్(28), నిర్మల్ సింగ్ (34)లు భార్యాభర్తలు. భర్తతో వివాదంపై గొడవపడిన భార్య నీరజ్ భర్త నిర్మల్ సింగ్ ను హతమార్చి శవాన్ని బెడ్ బాక్సులోపల దాచి పెట్టింది. ఒకరోజు తర్వాత భర్త శవం నుంచి దుర్వాసన రావడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-09-23T18:54:48+05:30 IST