ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిడ్నాప్ చేద్దామనుకున్న టీచర్‌కు షాకిచ్చిన పనిమనిషి

ABN, First Publish Date - 2020-02-18T01:34:49+05:30

కిడ్నాప్ చేసి భారీగా డబ్బు దండుకుందామనుకున్న టీచర్ పనిమనిషి దెబ్బకు పోలీసులకు చిక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కిడ్నాప్ చేసి భారీగా డబ్బు దండుకుందామనుకున్న ఓ టీచర్.. పనిమనిషి దెబ్బకు పోలీసులకు చిక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీకి చెందిన ఓ మహిళ ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె ఇటీవల కిడ్నాప్ చేసి డబ్బు సంపాదిద్దామని డిసైడైంది. ఈ క్రమంలో సఫ్‌దర్‌గంజ్ ఎన్‌క్లేవ్‌లోగల అపార్ట‌్‌మెంట్‌లో ఓ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఎంచుకున్న ఆ ఫ్లాట్ వద్దకెళ్లి తలుపు కొట్టింది. ఆ సమయంలో ఇంట్లో అనితా మిట్టల్, ఆమె మనవడు(తొమ్మిది నెలలు), పనిమనిషి మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో తలుపు తీసిన అనితపై ఆ టీచర్ కత్తితో దాడి చేసింది. ఆమె చేతిలో ఉన్న మనవడిని తీసుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. ఇది చూసిన అనిత.. పెద్ద పెట్టున అరవడంతో అప్రమత్తమైన పనిమనిషి ఆమెను అడ్డుకుంది. పెద్దగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. ఈలోపు ఆ టీచర్.. పనిమనిషి నుంచి తప్పించుకుని అపార్ట్‌మెంట్ గేటు వైపు పరుగు తీసింది. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకుని పసివాడిని విడిపించారు. అనంతరం టీచర్‌ను పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2020-02-18T01:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising