ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబై మెట్రోలో ప్రమాదం..ఒకరి మృతి,ఇద్దరికి గాయాలు

ABN, First Publish Date - 2020-10-31T16:39:36+05:30

ముంబై మెట్రోరైలు పిల్లరును ఓ క్రేన్ ఢీకొన్న దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (మహారాష్ట్ర): ముంబై మెట్రోరైలు పిల్లరును ఓ క్రేన్ ఢీకొన్న దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాండ్రా నుంచి జోగేశ్వరి వెళుతున్న క్రేన్ అంధేరి గుండవలి బస్టాపు వద్ద శనివారం ఉదయం మెట్రోపిల్లరును ఢీకొట్టింది. క్రేన్ మెట్రో పిల్లరును బలంగా ఢీకొట్టడంతో క్రేన్ కాస్తా రెండు భాగాలుగా ముక్కలైంది. ఈ ప్రమాద ఘటనలో బస్టాపులో నిలబడి ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. బస్టాపులో నిలబడి ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన క్రేన్ డ్రైవరు పరారయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. క్రేన్ డ్రైవరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు చెప్పారు.

Updated Date - 2020-10-31T16:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising