ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ విషయమై యాచకుల మధ్య వివాదం.. ఒకరి హత్య

ABN, First Publish Date - 2020-06-02T13:37:10+05:30

ఇద్దరు యాచకుల మధ్య తలెత్తిన వివాదంలో ఒకరు హత్యకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ఇద్దరు యాచకుల మధ్య తలెత్తిన వివాదంలో ఒకరు హత్యకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులను చాదర్‌ఘాట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఫుట్‌పాత్‌పై నివసిస్తున్న సర్దార్‌(35), ఖాజా పాషా(40) భిక్షాటన చేసి జీవిస్తున్నారు. ఓ యాచకురాలి కుమారుడు ఏడాదిన్నర బాలుడు ఇటీవల కిడ్నాపైన విషయం తెలిసిందే.


బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి చిన్నారిని తల్లికి అప్పగించారు. అప్పట్లో ఇద్దరు యాచకులు ఆమె వెంట ఉన్నారు. యాచకురాలి విషయమై పాషా, సర్ధార్‌ ఆదివారం అర్ధరాత్రి గొడవపడ్డారు. పాషా సంతోష్‌తో కలిసి సర్దార్‌ను పిడిగుద్దులు గుద్దడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పరిశీలించగా అతడు చనిపోయాడు. సర్దార్‌ హత్యకు కారకుడైన పాషాతోపాటు సహకరించిన సంతోష్ను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2020-06-02T13:37:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising