నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం.. ముగ్గురి మృతి
ABN, First Publish Date - 2020-12-05T21:15:21+05:30
భీమ్గల్ మండలం బడా భీమ్గల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మహీంద్రా కారు
నిజామాబాద్: భీమ్గల్ మండలం బడా భీమ్గల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మహీంద్రా కారు ఢీ కొట్టింది. అనంతరం అదే వేగంతో రోడ్డు పక్కన ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న భూమన్న, హోటల్లో ఉన్న చిన్న రాజన్న, భూదేవి అనే వ్యక్తులు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాంట్రాక్టర్గా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2020-12-05T21:15:21+05:30 IST