అరెస్టు చేశారంటూ మార్ఫింగ్ ఫొటోలతో ప్రచారం
ABN, First Publish Date - 2020-05-11T14:46:16+05:30
తనను అరెస్టు చేశారంటూ సోషల్మీడియాలో ప్రచారం చేసి, పరువుకు భంగం కలిగించారంటూ
హైదరాబాద్ : తనను అరెస్టు చేశారంటూ సోషల్మీడియాలో ప్రచారం చేసి, పరువుకు భంగం కలిగించారంటూ ఓ వ్యక్తి సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కరోనా నయం చేసే బాబా (కరోనా వైరస్ వాలే బాబా)గా అవతారం ఎత్తడంతో పోలీసులు అరెస్టు చేశారని మార్ఫింగ్ ఫొటోలు పెట్టి ప్రచారం చేశారు. బాధితుడు ఆ పోస్ట్ వచ్చిన వెబ్సైట్లు, సోషల్ యాప్లు, అనుమానితుల వివరాలు, ఆధారాలతో సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-05-11T14:46:16+05:30 IST