వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
ABN, First Publish Date - 2020-03-23T16:20:01+05:30
వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి చంపింది ఓ భార్య. మిల్స్కాలనీ పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ నగరంలోని కరీమాబాద్ కాశికుంటలో రాదారపు రాజు
వరంగల్ : వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి చంపింది ఓ భార్య. మిల్స్కాలనీ పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ నగరంలోని కరీమాబాద్ కాశికుంటలో రాదారపు రాజు (33) తన భార్యతో నివాసముంటున్నాడు. భార్యా, భర్తలకు తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రాజు భార్య శివరాత్రి అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి అనిల్తో కలిసి భర్తను తాడుతో మెడకు ఉరివేసి చంపింది. ఎవ్వరికీ తెలియకుండా తెల్లవారుజామున ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. మృతదేహం ఇంట్లోనే పడి ఉండడంతో కుళ్లిన వాసన వచ్చింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మిల్స్కాలనీ సీఐ నరేష్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి చెల్లి రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యానేరం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2020-03-23T16:20:01+05:30 IST