మాస్కుపై మత్తు చల్లి.. స్పృహలేని మైనర్పై అత్యాచారం!
ABN, First Publish Date - 2020-09-05T19:48:50+05:30
కరోనా భయంతో ధరించే మాస్కుపై మత్తు చల్లి ఓ మైనర్ బాలిపై అత్యాచారం చేశాడో కామాంధుడు.
చండీగఢ్: కరోనా భయంతో ధరించే మాస్కుపై మత్తు చల్లి ఓ మైనర్ బాలిపై అత్యాచారం చేశాడో కామాంధుడు. ఆమెకు స్పృహలేని సమయంలో జరిగిన ఈ ఘోరం గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. స్థానికంగా ఉండే ఓ లేబర్ కాంట్రాక్టర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మొఖానికి వేసుకునే ఓ ఫేస్మాస్కుపై మత్తు చల్లి, దాన్ని ఆమెకిచ్చాడతను.
విషయం తెలియని మైనర్ బాలిక.. ఆ మాస్కు వేసుకుంది. ఆ తర్వాత స్పృహతప్పింది. ఆ సమయంలో సదరు కాంట్రాక్టర్ ఆమెను బలాత్కరించాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడట. ఈ విషయం చెప్పి బాధితురాలు భోరుమంది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు కాంట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2020-09-05T19:48:50+05:30 IST