ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో భర్త చేస్తున్న పని చూసి భార్య షాక్

ABN, First Publish Date - 2020-03-10T18:10:04+05:30

మనిషి మాంసంతో వంట చేస్తున్న భర్తను చూసిన భార్య షాక్‌కు గురైన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిజనూర్ (ఉత్తరప్రదేశ్): మనిషి మాంసంతో వంట చేస్తున్న భర్తను చూసిన భార్య షాక్‌కు గురైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజనూర్ పట్టణ సమీపంలోని టిక్కోపూర్ గ్రామంలో సంచలనం రేపింది. టిక్కోపూర్ గ్రామానికి చెందిన సంజయ్ పీకల దాకా మద్యం తాగి మనిషి మాంసంతో వంట చేస్తున్నాడు. వీక్లీ మార్కెట్‌కు వెళ్లిన సంజయ్ భార్య (32) తిరిగి ఇంటికి వచ్చేసరికి భర్త వంటగదిలో పొయ్యిపై కడాయిలో మనిషి చేయి, వేళ్ల భాగాల మాంసాన్ని వండుతూ కనిపించాడు. అంతే షాక్ కు గురైన భార్య భర్త సంజయ్‌ను ఇంట్లోనే ఉంచి బయట నుంచి తలుపు మూసివేసి బయటకు పరుగెత్తింది. అనంతరం భార్య పొరుగింటి వారితోపాటు పోలీసులకు విషయం  చెప్పింది. దీంతో పోలీసులు వచ్చి చూడగా సంజయ్ మద్యం మత్తులో గంగా నదీ తీరంలోని శ్మశానవాటిక నుంచి మనిషి చేతి మాంసాన్ని తీసుకువచ్చి కడాయిలో వేసి వండుతున్నాడని తేలింది. పోలీసులు సంజయ్ ను అరెస్టు చేసి, అతనిపై కేసు నమోదు చేశారు. మనిషి మాంసాన్ని ఫ్రై చేసిన భర్త ఇంటికి తిరిగి వెళ్లేందుకు భార్య భయపడుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-10T18:10:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising