హెచ్సీయూ ప్రొఫెసర్ ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-11-30T10:06:21+05:30
కుటుంబ కలహాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం
గచ్చిబౌలి/హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం వర్సిటీలోని ఆఫీసర్స్ క్వార్టర్స్లో జరిగింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ప్రొఫెసర్ రిషిభరద్వాజ్(40) హెచ్సీయూలో మెడికల్సైన్సెస్ ప్రొఫెసర్. వర్సిటీలోని క్వార్టర్స్లోని బి-62లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నట్టు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురై.. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2020-11-30T10:06:21+05:30 IST