ఇంగ్లాండు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటులో పేలుడు...నలుగురి మృతి
ABN, First Publish Date - 2020-12-04T13:33:52+05:30
ఇంగ్లాండు దేశంలోని బ్రిస్టల్ నగర శివార్లలోని నీటిశుద్ధి ప్లాంటులో జరిగిన పేలుడులో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు....
బ్రిస్టల్ (ఇంగ్లాండ్): ఇంగ్లాండు దేశంలోని బ్రిస్టల్ నగర శివార్లలోని నీటిశుద్ధి ప్లాంటులో జరిగిన పేలుడులో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. బ్రిస్టల్ వాటర్ ప్లాంట్ లో సంభవించిన పేలుడులో నలుగురు కార్మికులు మరణించగా, మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారని చీఫ్ ఇన్ స్పెక్టరు మార్కు రనాక్రెస్ చెప్పారు.మృతుల్లో ముగ్గురు ప్లాంటు కార్మికులు కాగగా, మరోకరు కాంట్రాక్టరు అని పోలీసులు చెప్పారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నామని, అతనికి ప్రాణాపాయం లేదని పోలీసులు చెప్పారు. ఈ పేలుడు వల్ల సమీపంలో నివశించే ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పోలీసులు చెప్పారు. పేలుడుకు కారణాలపై ప్రభుత్వ ఆరోగ్య, భద్రతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడులో కార్మికుల మృతి ఘటనపై బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Updated Date - 2020-12-04T13:33:52+05:30 IST