ఆస్తి కోసం రక్తసంబంధులనే కడతేర్చాడు
ABN, First Publish Date - 2020-03-12T13:57:56+05:30
కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా సరిహద్దున మహారాష్ట్రలోని జెత్తా తాలూకా ఫాంహౌ్సలో తల్లిదండ్రులతో పాటు సోదరిని హతమార్చారు. ఆస్తి విషయంలో
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా సరిహద్దున మహారాష్ట్రలోని జెత్తా తాలూకా ఫాంహౌ్సలో తల్లిదండ్రులతో పాటు సోదరిని హతమార్చారు. ఆస్తి విషయంలో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు సాగుతుండేవి. ఈ మేరకు తండ్రి గురులింగప్ప అరకేరి (82), తల్లి నాగవ్వ అరకేరి (75), అక్క సముద్రబాయి (60)లను కిరాతకంగా హత్యచేశారు. బుధవారం ఉమది పోలీస్ స్టేషన్లో హత్యలకు కారకుడైన కొడుకు సిద్దప్ప అరకేరి లొంగిపోయాడు. గురులింగప్ప అరకేరి కుటుంబానికి విజయపుర జిల్లాలో బంధువులు ఉన్నట్టు సమాచారంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Updated Date - 2020-03-12T13:57:56+05:30 IST