ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో రోడ్డుపై మహిళల హల్‌చల్‌.. కారు అద్దాలు ధ్వంసం

ABN, First Publish Date - 2020-05-21T16:27:20+05:30

బిచ్చం అడిగితే ఇవ్వనందుకు ఓ కారు యజమానిపై ఇద్దరు మహిళలు రాళ్లతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ. 10 ఇవ్వలేదని కారు యజమానిపై దాడి


హైదరాబాద్/అడ్డగుట్ట : బిచ్చం అడిగితే ఇవ్వనందుకు ఓ కారు యజమానిపై ఇద్దరు మహిళలు రాళ్లతో దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేసిన ఘటన గోపాలపురం పోలీ‌స్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పాస్‌పోర్టు కార్యాలయంఎదుటగల సాగర్‌ హోమియో స్టోర్‌కు మందుల కోసం వెళ్లాడు. కారు షాపు ముందు పార్క్‌ చేసి మందులు కొనుగోలు చేసి వాహనం వద్దకు వెళ్లాడు. అదే సమయంలో ఇద్దరు మహిళలు గుడుంబా తాగిన మైకంలో అతడి వద్దకు వచ్చి రూ. 10 ఇవ్వాలని అడిగారు. తన వద్ద చిల్లర లేదని అతడు చెప్పగా.. మత్తులో ఉన్న మహిళలు తమ చేయి పట్టుకుంటావా అంటూ హంగామా సృష్టించారు. 


కారు అద్దాలు ధ్వంసం చేసి అతడిపై అందరూ చూస్తుండగానే రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న మార్కెట్‌ పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత గోపాలపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విషయం తెలుసుకున్నారు. దాడిచేసిన మహిళలను అదుపులోకి తీసుకోకుండా అక్కడి నుంచి పంపించేశారు. నడిరోడ్డుపై కారు యజమానిపై మహిళలు దాడిచేయడం, పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-21T16:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising