ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సులో మహిళా ప్రయాణికురాలిపై డ్రైవరు, కండక్టర్ల అఘాయిత్యం

ABN, First Publish Date - 2020-02-22T17:05:04+05:30

గుజరాత్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఒంటరి మహిళా ప్రయాణికురాలిపై డ్రైవరు, కండక్టర్లే సామూహిక అత్యాచారం చేసిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వడోదర (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఒంటరి మహిళా ప్రయాణికురాలిపై డ్రైవరు, కండక్టర్లే సామూహిక అత్యాచారం చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని పోర్‌బందర్ నగరంలో జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కుక్సీ పట్టణానికి చెందిన ఓ వివాహిత ఒంటరిగా పోర్‌బందర్ నగరానికి వచ్చేందుకు ప్రైవేటు లగ్జరీ బస్సు ఎక్కింది. బస్సు ఛోటా ఉదయపూర్ పోలీసుస్టేషను పరిధిలోకి రాగానే రాత్రి 9 గంటల సమయంలో ప్రయాణికులు భోజనం చేసేందుకు  ఆపారు. బస్సులో పడుకునేందుకు స్థలం చూపిస్తామంటూ బస్సు డ్రైవరు నన్న‌ాభాయ్, కండక్టర్ కపిల్‌లు వివాహితను బస్సు పైకి తీసుకువెళ్లి ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బాధిత వివాహిత అదే బస్సులో పోర్‌బందర్ నగరానికి చేరింది. పోర్‌బందర్‌లో మేనల్లుడి సహాయంతో బాధిత వివాహిత అత్యాచార ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బస్సు ఆపి  డ్రైవరు నన్న‌ాభాయ్, కండక్టర్ కపిల్‌ లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2020-02-22T17:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising