ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు కానిస్టేబుల్ దంపతుల హత్య

ABN, First Publish Date - 2020-12-18T16:56:38+05:30

ప్రత్యేక సాయుధ దళానికి చెందిన కానిస్టేబుల్, అతని భార్య హత్యకు గురైన ఘటన ఇండోర్ నగరంలో వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూతురితోపాటు ఆమె బాయ్ ఫ్రెండుపైనే అనుమానం

ఇండోర్ (మధ్యప్రదేశ్): ప్రత్యేక సాయుధ దళానికి చెందిన కానిస్టేబుల్, అతని భార్య హత్యకు గురైన ఘటన ఇండోర్ నగరంలో వెలుగుచూసింది. ఇండోర్ నగరంలోని ఏరోడ్రోమ్ ప్రాంతంలో జ్యోతిప్రసాద్ శర్మ (45), అతని భార్య నీలం (43)లు రక్తపు మడుగులో పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. హత్యకు ముందు వారి కుమార్తె అరుపులు వినిపించాయని  ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దంపతుల హత్యానంతరం వారి కుమార్తె, ఆమె బాయ్ ఫ్రెండ్ అదృశ్యమయ్యారు. దీంతో కుమార్తె తన బాయ్ ఫ్రెండుతో కలిసి తల్లిదండ్రులను మతమార్చి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నెలక్రితం తన కుమార్తె బాయ్ ఫ్రెండుతో హతుడైన కానిస్టేబులుకు వాగ్వాదం జరిగింది. దంపతులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పదునైన ఆయుధంతో వారిని హతమార్చారని తేలిందని పోలీసులు చెప్పారు. ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కుమార్తె కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2020-12-18T16:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising