ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చార్మినార్‌కు కాషాయరంగు...మార్ఫింగ్ ఫొటోపై పోలీసులకు ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-12-07T12:36:29+05:30

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయజనతాపార్టీకి 48 వార్డులు కైవసం చేసుకున్న నేపథ్యంలో పురాతన చారిత్రక చార్మినార్ ఫొటోకు కాషాయరంగు పులిమి మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అయింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయజనతాపార్టీకి 48 వార్డులు కైవసం చేసుకున్న నేపథ్యంలో పురాతన చారిత్రక చార్మినార్ ఫొటోకు కాషాయరంగు పులిమి మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. ఎన్నికల్లో కమల వికాసం అనంతరం సుమిత్ వి అనే వ్యక్తి ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాషాయరంగులో ఉన్న చార్మినార్ ఫొటో వైరల్ కావడంతో దీనిపై హైదరాబాద్ కు చెందిన సయ్యద్ షాదాబ్ అలీ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చిత్రం సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీస్తుందని ఫిర్యాదులో అలీ పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విషయాన్ని పరిశీలించాలని నగర సైబర్ క్రైం బ్రాంచ్ శాఖను కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 వార్డులు, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించింది. 

Updated Date - 2020-12-07T12:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising