ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి వర్క్ ఫ్రం హోం చిట్కా

ABN, First Publish Date - 2020-05-07T14:30:59+05:30

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో వర్క్ ఫ్రం హోం ఒక్కటే పరిష్కారమని గ్లోబల్ వర్క్‌ప్లేస్....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో వర్క్ ఫ్రం హోం ఒక్కటే పరిష్కారమని గ్లోబల్ వర్క్‌ప్లేస్ అనలిటిక్స్ ప్రెసిడెంట్ కేట్ లిస్టర్ వ్యాఖ్యానించారు.  కరోనా ప్రబలుతున్న సంక్షోభ సమయంలో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం చిట్కా అని కేట్ లిస్టర్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ ప్రబలుతుండగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ ఆర్థిక వ్యవస్థలను తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచం ఎలా పనిచేయాలనే విషయంపై కార్పొరేట్ కంపెనీల అధిపతులు, ఐటీ నిపుణులు ఆలోచనలు చేస్తున్నారు. కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని కొనసాగిస్తారా? లేదా కొంతమంది ఉద్యోగులు భ్రమణ ప్రాతిపదికన కార్యాలయానికి పిలుస్తారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సీన్ ఇంకా అందుబాటులోకి రానందున ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం సర్వసాధారణం కావచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. చాలా కంపెనీలు ఇంటి నుంచి పనిచేసే పద్ధతిని కొనసాగించడానికి మొగ్గు చూపిస్తున్నాయని కేట్ లిస్టర్ చెప్పారు. 


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లోని 3.5 లక్షల మంది ఉద్యోగులలో 75 శాతం మంది 2025 నాటికి ఇంటి నుంచే పని చేస్తారని ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం ప్రకటించారు. అంటే 25 శాతం మంది ఉద్యోగులే కార్యాలయంలో ఉంటారని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో 30 మిలియన్ల మంది ఉద్యోగులు రెండేళ్లపాటు ఇంటి నుంచి పనిచేస్తారని గ్లోబల్ వర్క్ ప్లేస్ అనలిటిక్స్ అంచనా వేసింది. తమ కంపెనీలో 25 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని కోరుకుంటున్నామని టెక్ మహీంద్రా ఎంపీ గుర్నానీ చెప్పారు.తాము హైబ్రిడ్ మోడల్ లోకి వెళ్లేలా సాంకేతికతను వృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీ, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, పారిస్ నగరాల్లో వర్క్ ఫ్రం హోం అమలు వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గింది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి నుంచి అధిక పనిచేస్తూ తక్కువ కాలుష్యంతో మెరుగైన జీవితం సాగిస్తున్నారు. 


Updated Date - 2020-05-07T14:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising