వీఐ ప్రీపెయిడ్ ప్లాన్లతో ఏడాదిపాటు జీ5 స్క్రిప్షన్ ఉచితం
ABN, First Publish Date - 2020-09-21T22:03:43+05:30
వీఐ (వొడాఫోన్ ఐడియా) తమ ఖాతాదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. తమ ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లతో జీ5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ను
న్యూఢిల్లీ: వీఐ (వొడాఫోన్ ఐడియా) తమ ఖాతాదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. తమ ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లతో జీ5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ను ఏడాది పాటు ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్లు రూ. 355 నుంచి రూ. 2559 వరకు ఉన్నాయి.
పరిమిత కాలంపాటు ప్రకటించిన ఈ ఆఫర్ వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. అర్హత కలిగిన ఖాతాదారులు ఒక వీఐఎల్ నంబరుపై ఒకసారి మాత్రమే ఈ ఆఫర్ పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్కు ఎటువంటి రెన్యువల్ ఉండదని కంపెనీ పేర్కొంది.
ఈ ఆఫర్ కోసం వీఐ ఖాతాదారులు రూ. 355, రూ. 405, రూ. 595, రూ. 795, రూ. 2,595 ప్లాన్లలో ఏదో ఒక ప్లాన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. రూ.355 ప్లాన్లో 28 రోజుల కాలపరిమితితో 50 జీబీ డేటా లభిస్తుంది. రూ. 405 ప్లాన్లో 90 జీబీ డేటా, అపరిమిత టాక్టైం, 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.
రూ. 595 ప్లాన్లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. కాలపరిమితి 56 రోజులు. రూ.795 ప్లాన్లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత టాక్టైం 84 రోజుల కాలపరిమితితో లభించనుండగా, రూ. 2,595 ప్లాన్లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత టాక్టైం లభిస్తుంది. కాలపరిమితి 365 రోజులు.
Updated Date - 2020-09-21T22:03:43+05:30 IST