యూపీఐకి మరింత ఆదరణ: ఎన్పీసీఐ
ABN, First Publish Date - 2020-05-21T06:53:37+05:30
లాక్డౌన్ నిబంధనల కారణంగా యూపీఐ ఆవశ్యకత మరింత పెరుగుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ రాయ్ తెలిపారు. చిన్న దుకాణాల్లో సైతం గుంపులను నిరోధించేందుకు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): లాక్డౌన్ నిబంధనల కారణంగా యూపీఐ ఆవశ్యకత మరింత పెరుగుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ రాయ్ తెలిపారు. చిన్న దుకాణాల్లో సైతం గుంపులను నిరోధించేందుకు దుకాణాల యజమానులు ఆన్లైన్లో సరుకుల ఆర్డర్లు తీసుకుని, ఆన్లైన్లో చెల్లింపులు చేయమని కోరతారని ఆయన అన్నారు. దీని వల్ల యూపీఐ వినియోగం మరింత పెరుగుతుందని వివరించారు. ప్రస్తుతం అనేక ఫిన్టెక్ కంపెనీలు డిజిటల్ పేమెంట్స్కు సంబంధించిన సేవలను చిన్న, చిన్న స్టోర్లకు అందిస్తున్నాయి. మరిన్ని లావాదేవీలకు యూపీఐని వినియోగించే వి ధంగా చేయడానికి కృషి చేస్తోందని చెప్పారు.
Updated Date - 2020-05-21T06:53:37+05:30 IST