ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2008 ఆర్థిక మాంద్యం కంటే మూడు రెట్ల నష్టం

ABN, First Publish Date - 2020-05-20T07:15:47+05:30

కరోనా సంక్షోభం నుంచి బయటపడి ప్రపం చ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునేందుకు చాలాకాలం పట్టవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌, ప్రయాణ ఆంక్షలు, వ్యాపారాల మూసివేత వంటి కరోనా నియంత్రణ నిర్ణయాలతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రపంచ వృద్ధి -5.5శాతానికి పతనం: ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ 



వాషింగ్టన్‌: కరోనా సంక్షోభం నుంచి బయటపడి ప్రపం చ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునేందుకు చాలాకాలం పట్టవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌, ప్రయాణ ఆంక్షలు, వ్యాపారాల మూసివేత వంటి కరోనా నియంత్రణ నిర్ణయాలతో ప్రపంచ వృద్ధి పునరుద్ధరణకు ఇబ్బందులు ఎదురుకానున్నాయని రెండు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ వృద్ధి -5.5 శాతానికి క్షీణించవచ్చని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అంచనా వేసింది. కరోనా సంక్షోభంతో గ్లోబల్‌ ఎకానమీకి 2008 ఆర్థిక మాం ద్యం కంటే మూడు రెట్ల నష్టం వాటిల్లనుందని అంటోంది. ఈ సంవత్సరం అమెరికా వృద్ధి రేటు -7.3 శాతానికి, ఐరో పా దేశాల సమాఖ్య జీడీపీ వృద్ధి -8.6 శాతానికి పతనం కావచ్చని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అంచనా. పెద్ద ఎత్తున వ్యాపారాలు దివాలా తీయనున్నాయని, వినియోగదారులు ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చని సంస్థ హెచ్చరించింది. ఇది ఆర్థిక వృద్ధికి తీవ్ర విఘాతం కల్గించవచ్చంటోంది. 


Updated Date - 2020-05-20T07:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising