ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసారి వృద్ధి మైనస్‌ 9%: ఏడీబీ

ABN, First Publish Date - 2020-09-16T06:17:43+05:30

కరోనా దెబ్బకు కుదేలైన భారత్‌ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో -9 శాతానికి క్షీణించవచ్చని ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు కుదేలైన భారత్‌ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో -9 శాతానికి క్షీణించవచ్చని ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. జూన్‌లో అంచనా వేసిన -4 శాతం వృద్ధి క్షీణతతో పోలిస్తే ఇది చాలా అధికం. గడిచిన నాలుగు దశాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా వృద్ధి పతనాన్ని చవిచూడనుందని ఏడీబీ తాజా నివేదికలో పేర్కొంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో మాత్రం వృద్ధి రేటు ఏకంగా 8 శాతానికి ఎగబాకనుందని భావిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాని (ఏప్రిల్‌-జూన్‌)కి జీడీపీ వృద్ధి -23.9 శాతానికి పతనమైన విషయం తెలిసిందే. దాంతో దేశీయ, అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు, ప్రముఖ ఆర్థిక సంస్థలు ఇప్పటికే వృద్ధి అంచనాలను సవరించాయి. 

Updated Date - 2020-09-16T06:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising