ఆదాయపు పన్ను రిఫండ్ రూ.62,361 కోట్లు
ABN, First Publish Date - 2020-07-04T06:46:05+05:30
ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్ 8 నుంచి జూన్ 30 మధ్య కాలంలో 20 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.62,361 కోట్ల విలువ గల రిఫండ్లు చెల్లించింది. 19.07 లక్షల వ్యక్తిగత ఐటీ మదింపుదారులకు రూ.23,453.57 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్ 8 నుంచి జూన్ 30 మధ్య కాలంలో 20 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.62,361 కోట్ల విలువ గల రిఫండ్లు చెల్లించింది. 19.07 లక్షల వ్యక్తిగత ఐటీ మదింపుదారులకు రూ.23,453.57 కోట్లు, 1.36 లక్షల కార్పొరేట్ మదింపుదారులకు రూ.39,908.37 కోట్లు రిఫండ్ చేసినట్టు సీబీడీటీ ప్రకటించింది. నిమిషానికి 76 కేసుల పరిష్కార వేగంతో ఐటీ శాఖ పని చేసి మొత్తం 20.44 కోట్ల రిఫండ్లను పరిష్కరించిందని తెలిపింది. కొన్ని కేసుల్లో వివరాలు అడుగుతూ ఐటీ శాఖ.. ఈ-మెయిల్ సందేశాలు పంపిందని, వారు దానికి ఎంత తొందరగా సమాధానం ఇస్తే అంత త్వరగా రిఫండ్లు ప్రాసెస్ చేస్తామని ప్రకటించింది.
Updated Date - 2020-07-04T06:46:05+05:30 IST