ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ పుంజుకున్న దేశీయ మార్కెట్లు.. సెన్సెక్స్ 400 పాయింట్లు అప్..

ABN, First Publish Date - 2020-07-09T22:45:04+05:30

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ పుంజుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరుతో పాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ పుంజుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరుతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపించినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా బలపడగా.. నిఫ్టీ సైతం 1 శాతం మేర ఎగబాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 408.68 పాయింట్లు (1.12 శాతం) ఎగసి 36,737.69 వద్ద క్లోజ్ అయ్యింది. నిఫ్టీ సైతం  107.70 పాయింట్ల (1.01 శాతం) లాభంతో 10,813.45 వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్ 4 శాతం లాభంతో టాప్‌లో ఉండగా.. ఎస్‌బీఐ, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి. మరోవైపు ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌యూఎల్, మారుతి తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి. 

Updated Date - 2020-07-09T22:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising