ఆర్బీఐ ప్రకటనతో తీవ్ర నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ABN, First Publish Date - 2020-05-22T16:30:32+05:30
ఆర్బీఐ గవర్నర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు...
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా నష్టపోయింది. బ్యాంకింగ్ రంగం భారీగా నష్టపోయింది. రూపాయి విలువ 23 పైసలు నష్టపోయి 75.84కి చేరింది. రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. రివర్స్ రెపోరేటు 3.35శాతానికి కుదిస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు దెబ్బతిన్నాయని, మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకు రెపో రేటు తగ్గించామని ఆయన స్పష్టం చేశారు. రుణాలపై మారటోరియం మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 2021లోనూ జీడీపీ తిరోగమనంలోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ ప్రకటన స్టాక్ మార్కెట్లను కుదేలు చేసింది.
Updated Date - 2020-05-22T16:30:32+05:30 IST