రికవరీ ఆశలతో మార్కెట్లో ర్యాలీ
ABN, First Publish Date - 2020-07-02T06:09:23+05:30
రికవరీ ఆశలతో మార్కెట్లో ర్యాలీ
ముంబై: రెండు రోజుల వరుస నష్టాల తర్వాత బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ ర్యాలీ బాట పట్టింది. కొనుగోళ్ల మద్దతుతో 498.65 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 35,414.45 వద్ద, 127.95 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10,430.05 వద్ద ముగిశాయి. జూన్ నెల జీఎ్సటీ వసూళ్లు, పీఎంఐ ఆశాజనకంగా ఉండడం, మార్కెట్ను పరిగెత్తించింది. కనివిని ఎరుగని నష్టాల కారణంగా వొడాఫోన్ ఐడియా షేరు 4 శాతం నష్టపోయింది.
Updated Date - 2020-07-02T06:09:23+05:30 IST