ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశ్రామిక,సేవల రంగాలు కుదేలు

ABN, First Publish Date - 2020-07-13T05:54:33+05:30

పారిశ్రామిక, వాణిజ్య సంఘాలకు ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఏ మాత్రం నమ్మకం కుదరడం లేదు. తాజాగా కొవిడ్‌-19 దెబ్బకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 4.5 శాతానికి పడిపోతుందని ఫిక్కీ నివేదిక వెల్లడించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  • 2020-21లో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 4.5 శాతానికి
  • ఫిక్కీ నివేదిక వెల్లడి 

న్యూఢిల్లీ: పారిశ్రామిక, వాణిజ్య సంఘాలకు ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఏ మాత్రం నమ్మకం కుదరడం లేదు. తాజాగా కొవిడ్‌-19 దెబ్బకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 4.5 శాతానికి పడిపోతుందని ఫిక్కీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదికలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ఫిక్కీ అంచనా వేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ చతికిల పడడంతో వృద్ధి రేటు అంచనాల్ని మైనస్‌ స్థాయికి కుదించాల్సి వచ్చిందని పేర్కొంది. పరిస్థితులు మరింత విషమిస్తే వృద్ధి రేటు మైనస్‌ 6.4 శాతానికి కూడా పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన  వ్యక్తం చేసింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి వృద్ధి రేటు పుంజుకున్నా అది 1.5 శాతానికి మించదని స్పష్టం చేసింది. 


తొలి త్రైమాసికం ఘోరం

లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో జీడీపీ వృద్ధి రేటు ఘోరంగా పడిపోయినట్టు ఫిక్కీ పేర్కొంది. ఈ తరుగుదల ఏకంగా మైనస్‌ 14.2 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఈ త్రైమాసికంలో పారిశ్రామిక, సేవల రంగాలు పూర్తిగా నిలిచిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. జూన్‌ నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినప్పటికీ ఈ రంగాలు ఇంకా కోలుకోలేదని తెలిపింది. ఎఫ్‌ఎంసీజీ, వినియోగ వస్తువుల కంపెనీలు మినహా మిగిలిన రంగాల్లోని కంపెనీలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించలేదని తెలిపింది. సరఫరా సమస్యలు కొంత సద్దుమణిగినప్పటికీ ‘డిమాండ్‌’ కొరత సమస్య ఇంకా అలానే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. 


వ్యవ‘సాయ’మే ఆధారం

పారిశ్రామిక, సేవల రంగాలు కుప్పకూలినప్పటికీ వరుణుడి కటాక్షంతో వ్యవ సాయం రంగం ఒక్కటే ప్రస్తుతం ఆశాజనకంగా కనిపిస్తోందని ఫిక్కీ పేర్కొంది. దీంతో గ్రామీణ డిమాండ్‌ కొద్దిగా ఆర్థిక వ్యవస్థను ఆదుకుంటుందని అంచనా వేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు పెంచడం ఇందుకు దోహదం చేయనుం దని తెలిపింది. 


వడ్డీ రేట్లు  ఇంకా తగ్గుతాయ్‌ 

దేశంలో వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని ఫిక్కీ అంచనా వేస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రెపో రేటు 2.5 శాతం తగ్గించినప్పటికీ  అందులో ఎక్కువ భాగం ఇంకా రుణగ్రహీతలకు చేరలేదని  ఆర్‌బీఐ భావిస్తోందని పేర్కొంది. దీంతో మున్ముందు రెపో రేటు మరింత తగ్గించే అవకాశం ఉందని ఫిక్కీ అంటోంది. 


Updated Date - 2020-07-13T05:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising