ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో ఎన్‌సీఎల్‌ యూనిట్‌

ABN, First Publish Date - 2020-07-01T06:05:38+05:30

విశాఖపట్నం సమీపంలో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ రోజుకు 2,000 టన్నుల సామర్థ్యంతో సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఇందుకు బోర్డు ఆమోదం తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : విశాఖపట్నం సమీపంలో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ రోజుకు 2,000 టన్నుల సామర్థ్యంతో సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఇందుకు బోర్డు ఆమోదం తెలిపింది.  దీంతో పాటు సూర్యాపేట జిల్లా మట్టపల్లిలోని సిమెంట్‌ యూనిట్‌ను నవీకరించనుంది. ఈ విస్తరణ, నవీకరణకు రూ.203 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. నిధుల లభ్యత తర్వాత ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.


2019-20 ఏడాదికి రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూపాయి (10శాతం) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో గత ఏడాదికి మొత్తం 25 శాతం డివిడెండ్‌ చెల్లించినట్లవుతుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి కంపెనీ స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన నికర లాభం రూ.26.46 కోట్ల నుంచి రూ.7.66 కోట్లకు తగ్గింది. ఆదాయం రూ.272 కోట్ల నుంచి రూ.249 కోట్లకు పరిమితమైంది. 


Updated Date - 2020-07-01T06:05:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising