ఎంఎస్ఎంఈల ప్రత్యేక రుణ హామీ పొడిగింపు
ABN, First Publish Date - 2020-11-03T05:36:26+05:30
ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా ఎంఎ్సఎంఈలకు ప్రకటించిన అత్యవసర రుణ హామీ (ఈసీఎల్జీఎస్) పథకం గడువును ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది...
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా ఎంఎ్సఎంఈలకు ప్రకటించిన అత్యవసర రుణ హామీ (ఈసీఎల్జీఎస్) పథకం గడువును ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ స్కీమ్ కింద రూ.3 లక్షల కోట్ల రుణ వితరణ చేయాలన్న లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు. అక్టోబరు 31తో స్కీమ్ గడువు ముగిసింది. రూ.3 లక్షల కోట్ల లక్ష్యం చేరే వరకు లేదా నవంబరు 30 ఏది ముందైతే అంతవరకు ఈ స్కీమ్ గడువు పొడిగించినట్టు ప్రభుత్వం తెలిపింది.
Updated Date - 2020-11-03T05:36:26+05:30 IST