ఆయిల్ పామ్ రైతులకు ‘3ఎఫ్ అక్షయ’ యాప్
ABN, First Publish Date - 2020-05-27T06:46:10+05:30
ఆయిల్ పామ్ రైతులకు ‘3ఎఫ్ అక్షయ’ యాప్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్కు చెందిన 3ఎఫ్ అయిల్పామ్ అగ్రిటెక్ కంపెనీ పామాయిల్ రైతుల కోసం ‘3ఎఫ్ అక్షయ’ పేరుతో మొబైల్ యాప్ను విడుదల చేసింది. పామాయిల్ రైతుల కోసం ప్రవేశపెట్టిన తొలి యాప్ ఇదేనని 3ఎఫ్ ఆయిల్ పా మ్ అగ్రిటెక్ సీఈఓ, ఎండీ సంజయ్ గోయెంకా తెలిపారు. ఎరువులకు ఆర్డర్ ఇవ్వడం నుంచి పంట రుణాలు పొంద డం వరకూ అన్ని సేవలను ఈ యాప్ ద్వారా రైతులకు కంపెనీ అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఈశాన్య ప్రాంతాల్లోని రైతులు ఈ యాప్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఏపీలోని దాదాపు 20 వేల మంది రైతు లు యాప్ను వెంటనే వినియోగించుకోవచ్చని తెలిపింది.
Updated Date - 2020-05-27T06:46:10+05:30 IST