దివాలా చట్టంలో మరిన్ని మార్పులు
ABN, First Publish Date - 2020-11-26T08:08:46+05:30
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ర ప్ట్సీ బోర్డు ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) దివాలా చట్టంలో మరిన్ని మార్పులు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై వచ్చే నెల 15లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరింది
న్యూఢిల్లీ: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ర ప్ట్సీ బోర్డు ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) దివాలా చట్టంలో మరిన్ని మార్పులు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై వచ్చే నెల 15లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరింది. స్వచ్ఛందంగా దివాలా ప్రక్రియలో ఉన్న ఒక కంపెనీ, ఆ ప్రక్రియ నుంచి ఉపసంహరించుకునేందుకు సంబంధించి ప్రతిపాదనలు చేసింది.
అవేమిటంటే..
- దివాలా కేసును విచారిస్తున్న సంస్థ నుంచి ముందస్తు అనుమతితో ఉపసంహరణ
- కొన్ని షరతులకు లోబడి మాత్రమే కేసు ఉపసంహరణకు అనుమతి
- ప్రత్యేక తీర్మానం ద్వారానే దివాలా ప్రక్రియ నుంచి ఉపసంహరణకు దరఖాస్తు
- కంపెనీ ఆస్తుల అమ్మకం లేకపోతే రుణదాతల్లో మూడింత రెండు వంతుల మంది ఆమోదం ఉండాలి.
Updated Date - 2020-11-26T08:08:46+05:30 IST