ప్లిప్కార్ట్ సేవలు బంద్, అమెజాన్ నిత్యావసరేతర సరకుల పంపిణీ నిలిపివేత
ABN, First Publish Date - 2020-03-25T16:02:28+05:30
కరోనా వ్యాప్తి వల్ల లాక్ డౌన్ ప్రభావం ఈ కామర్స్ వెబ్ సైట్లపై పడింది....
న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి వల్ల లాక్ డౌన్ ప్రభావం ఈ కామర్స్ వెబ్ సైట్లపై పడింది. కరోనా వైరస్ వ్యాప్తితో కేంద్రం 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించడంతో ఈకామర్స్ వెబ్ సైట్ అయిన ప్లిప్కార్ట్ తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. మరో ఆన్లైన్ వెబ్ సైట్ అయిన అమెజాన్ నిత్యావసరేతర వస్తువుల పంపిణీని నిలిపివేసింది. దేశంలో లాక్ డౌన్ సందర్భంగా తాము వినియోగదారులకు నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రాధాన్యమిస్తామని అమెజాన్ ప్రకటించింది.
నిత్యావసర వస్తువులను వినియోగదారులకు అందించేందుకు తాము ప్రాధాన్యమిస్తామని అమెజాన్ ఇండియా వివరించింది. కాగా అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్లో వినియోగదారులు బుధవారం సరకులను ఆర్డరు చేస్తే డెలివరీ ఏప్రిల్ నెల 10వతేదీ తర్వాత చేస్తామని అంటున్నారు. దేశంలో లాక్ డౌన్ ప్రభావం ఈకామర్స్ షాపింగ్ పై కూడా పడినట్లయింది.
Updated Date - 2020-03-25T16:02:28+05:30 IST