ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాయకల్ప చికిత్స తప్పనిసరి

ABN, First Publish Date - 2020-05-22T06:51:11+05:30

ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. మనం అన్ని రంగాలనూ సమూలంగా మరమ్మత్తు చేయవలసి ఉంటుందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మరింత భారీ ప్యాకేజీ,  సంస్కరణలు కావాలి
  • రఘురాం రాజన్‌

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. మనం అన్ని రంగాలనూ సమూలంగా మరమ్మత్తు చేయవలసి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారీ పారిశ్రామిక సంస్థలు, బ్యాంకులు, ఎంఎ్‌సఎంఈలు అన్నింటికీ ఏదో ఒక రకమైన ఉద్దీపన అవసరమేనని ఆయన సూచించారు. అలాగే మనం పలు రంగాల్లో సంస్కరణలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘ది వైర్‌’ న్యూస్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కరోనా వల్ల ఏర్పడిన నష్టంతో పోల్చితే ఇటీవల ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఏ మాత్రం చాలదన్నారు.


కష్టాల్లో ఉన్న రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోకపోతే, ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత భారీగా నష్టపోయే పోయే ప్రమాదం ఉందని రాజన్‌ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ద్రవ్య లోటు పెరిగి, అంతర్జాతీయ పరపతి రేటింగ్‌ సంస్థలు దేశ  పరపతి రేటింగ్‌ను తగ్గిస్తాయనే ఆందోళనా అనవసరం అన్నారు. కష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్‌, టూరిజం, కార్ల కంపెనీలు, నిర్మాణ రంగాలను ఆదుకునేందుకు అమెరికాలో వలె ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం భారత్‌లో సాధ్యం కాదని ఆయన చెప్పారు. బక్కచిక్కిన ఈ సంస్థలను ఆదుకునేందుకు రుణ పునర్‌ వ్యవస్థీకరణతో పాటు, మూల ధన సాయం కూడా అవసరం కావచ్చన్నారు. 


వలస కార్మికులకు నగదు సాయం

వలస కార్మికులకు ఉచిత ఆహార ధాన్యాలందిస్తే చాలదని, ఉచిత నగదు సాయం అందించాల్సిన అవసరం ఉన్నదని రాజన్‌ నొక్కి చెప్పారు. నగదు సాయం లేకపోతే వారు కూరగాయలు, వంట నూనెల వంటి నిత్యావసర వస్తువులు కొనుక్కోవడమూ కష్టమవుతుందన్నారు. 


విపక్షాల సలహాలూ అవసరం 

కోవిడ్‌-19తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచే జరగాలనుకోవడంపైనా రాజన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం విపక్ష నేతల నుంచి కూడా ఈ గండం నుంచి గట్టెక్కేందుకు అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అనుకోవాలేగానీ, మంచి సలహాలు ఇచ్చే నిపుణులకు మన దేశంలో ఎలాంటి కొరత లేదన్నారు. 


Updated Date - 2020-05-22T06:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising