ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లో బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్

ABN, First Publish Date - 2020-03-31T00:50:35+05:30

లాక్‌డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్న బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు ఇది శుభవార్తే. గతవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్న బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు ఇది శుభవార్తే. గతవారం కాలపరిమితి ముగిసిన ఖాతాదారులకు ఏప్రిల్ 20 వరకు వ్యాలిడిటీని పొడిగిస్తూ బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది పూర్తిగా ఉచితమని పేర్కొంది. వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్ అందుకునేందుకే కాలపరిమితిని పొడిగించినట్టు వివరించింది. దీంతోపాటు జీరో బ్యాలెన్స్‌కు చేరుకున్న వినియోగదారులకు ఉచితంగా పది రూపాయల విలువైన టాక్‌టైంను కూడా అందిస్తున్నట్టు తెలిపింది. అత్యవసర సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది.


ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తమ ఖాతాదారులకు అండగా ఉంటుందని ఆ సంస్థ సీఎండీ ప్రవీణ్ కుమార్ పూర్వార్ తెలిపారు. వినియోగదారులు తమ ఖాతాలను రీచార్జ్ చేసుకునేందుకు ‘మై బీఎస్ఎన్ఎల్ యాప్’, బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌తోపాటు ఇతర పాపులర్ వ్యాలెట్లను ఉపయోగించుకోవాలని కోరారు. 


లాక్‌డౌన్ నేపథ్యంలో వలసదారుల ప్రయోజనార్థం కాల్స్ ఉచితంగా చేసుకునే సదుపాయం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ వంటి టెలికం కంపెనీలను కోరుతూ లేఖ రాసింది. నెల రోజులపాటు ఉచితంగా ఔట్ గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆ లేఖలో కోరినట్టు ప్రియాంక గాంధీ తెలిపారు. స్పందించిన బీఎస్ఎన్ఎల్ వ్యాలిడిటీని వచ్చే నెల 20 వరకు పెంచినట్టు ప్రకటించింది.

Updated Date - 2020-03-31T00:50:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising