హెరిటేజ్ నుంచి అశ్వగంధ పాలు
ABN, First Publish Date - 2020-11-20T06:42:48+05:30
విలువ జోడించిన ఉత్పత్తులను విపణిలోకి విడుదల చేసే వ్యూహంలో భాగంగా హెరిటేజ్ ఫుడ్స్ అశ్వగంధ పాలను విడుదల చేసింది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని కంపెనీ వెల్లడించింది. 170 ఎంఎల్ పీపీ బాటిళ్లలో అశ్వగంధ పాలు లభిస్తాయి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): విలువ జోడించిన ఉత్పత్తులను విపణిలోకి విడుదల చేసే వ్యూహంలో భాగంగా హెరిటేజ్ ఫుడ్స్ అశ్వగంధ పాలను విడుదల చేసింది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని కంపెనీ వెల్లడించింది. 170 ఎంఎల్ పీపీ బాటిళ్లలో అశ్వగంధ పాలు లభిస్తాయి. ఒక్కో బాటిల్ ధర రూ.30. పండుగల సీజన్ను దృష్టిలో ఉం చుకుని 4 కోన్లు ఉండే గిఫ్ట్ ప్యాక్ను కూడా హెరిటేజ్ విడుదల చేసింది. ఇందులో రెండు చాకోలేట్, బటర్స్కాచ్ కోన్ ఐస్క్రీములు ఉంటాయి. వినియోగదారుల సౌకర్యార్ధం చిన్న, చిన్న నేతి ప్యాకెట్లను ప్రవేశపెట్టింది. ఇటీవలే కంపెనీ వ్యాధి నిరోధక శక్తిని పెంచే అల్లం, తులసి, పసుపు రుచుల్లో పాలను విడుదల చేసింది. ప్రాచీన ఆయుర్వేద ఔషధం ఆధారంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే అశ్వగంధ పాలను విడుదల చేయడం సంతోషంగా ఉందని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మణి నారా తెలిపారు.
Updated Date - 2020-11-20T06:42:48+05:30 IST