రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తెలిపే వాచ్
ABN, First Publish Date - 2020-09-16T06:23:46+05:30
అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. తన స్మార్ట్వాచ్లో 6 సిరీ్సను ఆవిష్కరించింది. రక్తంలో ప్రాణవాయువు (
6 సిరీస్ స్మార్ట్వాచ్ను ఆవిష్కరించిన యాపిల్
కాలిఫోర్నియా: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. తన స్మార్ట్వాచ్లో 6 సిరీ్సను ఆవిష్కరించింది. రక్తంలో ప్రాణవాయువు (ఆక్సిజన్) స్థాయెంతో చెప్పగలగడం ఈ వాచ్ ప్రత్యేకతని యాపిల్ వెల్లడించింది. సాధారణంగా ఇందుకు పల్స్ ఆక్సిమీటర్ అవసరం అవుతుంది. కరోనా వ్యాప్తి కాలంలో ప్రజలకు రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గకుండా చూసుకోవడం కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో ఆక్సిమీటర్ అవసరం లేకుండానే రక్తంలో ఆక్సిజన్ స్థాయిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేందుకు వీలుగా యాపిల్ కొత్త స్మార్వాచ్ను అందుబాటులోకి తేవడం గమనార్హం. ఏడు రంగుల్లో లభించే ఈ వాచ్ ప్రారంభ ధర 399 డాలర్లు. 6 సిరీస్ వాచ్తో పాటు యాపిల్ వాచ్ ఎస్ఈని సైతం విడుదల చేసింది. ఫ్యామిలీ సెటప్, ఫాల్ డిటెక్షన్ వంటి ఫీచర్లతో కూడిన దీని ధర 279 డాలర్లు.
Updated Date - 2020-09-16T06:23:46+05:30 IST