రసాభాసగా మారిన వైఎస్సార్ జయంతి వేడుక
ABN, First Publish Date - 2020-07-08T20:32:00+05:30
రాజమండ్రి: రాజోలులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి వేడుక రసాభాసగా మారింది.
రాజమండ్రి: రాజోలులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి వేడుక రసాభాసగా మారింది. బొంతు రాజేశ్వరరావు- అమ్మాజీ వర్గాల మధ్య మాటల యుద్దం జరిగింది. వైసీపీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను పక్కన పెట్టి జనసేన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బొంతు వర్గం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడి పెట్టుకుని మాల కార్పోరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అమలాపురం పార్లమెంటరీ పార్టీ ఇన్చార్జి తోట త్రిమూర్తులు, అమలాపురం ఎంపీ అనురాధ సమక్షంలో రెండు వర్గాల మధ్య పంచాయతీ జరిగింది.
Updated Date - 2020-07-08T20:32:00+05:30 IST