పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట యువకుల ఆందోళన
ABN, First Publish Date - 2020-08-05T21:22:22+05:30
విజయనగరం: పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర యువకులు ఆందోళన నెలకొంది.
విజయనగరం: పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర యువకులు ఆందోళన నెలకొంది. తమ గ్రామంలో 14 మందికి కరోనా సోకినా ఆసుపత్రికి తరలించలేదని నిరసనకు దిగారు. కరోనా రోగులను తరలించమని గ్రామ సచివాలయ సిబ్బందిని అడిగితే, దిక్కున్న చోట చెప్పుకోమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాన్ని మూసేయమని అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
Updated Date - 2020-08-05T21:22:22+05:30 IST