శ్రీశైలం సున్నిపెంటలో యువకుడు ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-08-10T02:07:43+05:30
శ్రీశైలం సున్నిపెంటలో యువకుడు ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శ్రీశైలం సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీశైలం మండలం సున్నిపెంటలో విజయ్ కుమార్ (26) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. బీటెక్ చదివినా ఉద్యోగం రాలేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసి విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, యువకుడి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
Updated Date - 2020-08-10T02:07:43+05:30 IST