జడ్జి రామకృష్ణ తమ్ముడిపై హత్యాయత్నం
ABN, First Publish Date - 2020-09-27T23:48:41+05:30
జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై వైసీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బి.కొత్తకోట మెయిన్రోడ్లో సరుకులు తీసుకుంటున్న..
చిత్తూరు: జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై వైసీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బి.కొత్తకోట మెయిన్రోడ్లో సరుకులు తీసుకుంటున్న రామచంద్రపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన కారులో వచ్చి ఐదుగురు గూండాలు తెగబడ్డారు. అనంతరం వారందరూ పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రామచంద్రను బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైసీపీ నాయకులతో కలిసి దుండగులు ఈ దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది
Updated Date - 2020-09-27T23:48:41+05:30 IST