ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాస్పత్రిలో వైసీపీ వీరంగం

ABN, First Publish Date - 2020-11-26T09:05:26+05:30

గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో బుధవారం వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఉన్న ఒక వర్గం వారిపై వేటకొడవళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ వర్గంపై వేట కొడవళ్లు, కర్రలతో దాడి 


చిలకలూరిపేట, నవంబరు 25: గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో బుధవారం వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఉన్న ఒక వర్గం వారిపై వేటకొడవళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. గర్భిణులు, రోగులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఈ దాడిలో 10 మంది గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు... చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని కట్టుబడివారిపాలెం గ్రామంలో ఓ స్థలం విషయంలో వైసీపీకి చెందిన ముత్యాల రామారావు, మేరం శ్రీనివాసరావు వర్గాల మధ్య వివాదం ఉంది. ఈ విషయంపై మాటామాటా పెరిగి మంగళవారం ఘర్షణకు దిగారు.


గాయపడినవారు చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం చేరారు. దీనిపై స్థానిక రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ నేపఽథ్యంలో బుఽధవారం ప్రభుత్వాస్పత్రి వేదికగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మేరం శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న గది రక్తపు మరకలతో నిండిపోయింది. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో దాడుల ఘటనపై అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కరరావు పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రిలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-11-26T09:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising