లోక్సభలో ఆర్ఆర్ఆర్ ప్రసంగాన్ని అడ్డుకున్న వైసీపీ ఎంపీలు
ABN, First Publish Date - 2020-09-19T23:29:52+05:30
లోక్సభలో గందరగోళం నెలకొంది. ఏపీలోని హిందూదేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాలను ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్సభలో...
న్యూఢిల్లీ: లోక్సభలో గందరగోళం నెలకొంది. ఏపీలోని హిందూదేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాలను ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్సభలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లోని ఆలయాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, దీనిపై కమిషన్ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతుంటే వైసీపీ ఎంపీలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్క వ్యక్తి కోసం ఏపీలో హిందూ దేవాలయాల నిబంధనలను మారుస్తున్నారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.
Updated Date - 2020-09-19T23:29:52+05:30 IST