జగన్ నిర్ణయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది: మోపిదేవి
ABN, First Publish Date - 2020-11-03T22:25:32+05:30
బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ‘జయహో జగనన్న’ బీసీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి
గుంటూరు: బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ‘జయహో జగనన్న’ బీసీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి మాట్లాడారు. ‘పాదయాత్రలో ప్రజలు స్థితిగతులను జగన్ కళ్లారా చూశారు. రాజకీయ ఆరంగ్రేటం నుంచి సీఎం అయ్యేంత వరకూ ఓ చరిత్ర. బీసీ సామాజిక వర్గాలు ఇప్పటి వరకూ ఓటు బ్యాంక్గానే ఉన్నాయి. బీసీలకు పదవులు అంటే మూడు నాలుగు కులలాకే అందేవి. ఇప్పుడు అన్ని కులాలకు జగన్ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు. సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు వచ్చిన పదవులు విజిటింగ్ కార్డులకే పరిమితం కాకూడదు. జగన్ ఆశయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వెనకబడిన కులాల్లో అభివృద్ధి చెందేలా కార్పొరేషన్లు పని చేయాలి’ అని మోపిదేవి ఆకాంక్షించారు.
Updated Date - 2020-11-03T22:25:32+05:30 IST