ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు గుడి.. వైసీపీ నాయకులపై జనం సెటైర్లు

ABN, First Publish Date - 2020-08-05T23:29:13+05:30

జిల్లాలోని గోపాలపురం మండలం రాజంపాలెంలో వైసీపీ నాయకులకు పైత్యం ముదిరింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా భావిస్తూ గుడి నిర్మాణానికి వైసీపీ నాయకుడొకరు శంకుస్థాపన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలోని గోపాలపురం మండలం రాజంపాలెంలో వైసీపీ నాయకులకు పైత్యం ముదిరిందంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా భావిస్తూ గుడి నిర్మాణానికి వైసీపీ నాయకుడొకరు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. తమ నాయకుడిని దైవాంశ సంభూతుడిగా కొలిచేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమి దగ్గర సీఎం జగన్‌ గుడి నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. ఇది చూసిన రాజంపాలెం గ్రామస్తులు ముక్కున వేలు వేసుకుని.. వైసీపీ నేతలకు పైత్యం ముదిరిందంటూ సెటైర్లు వేస్తున్నారు.

Updated Date - 2020-08-05T23:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising