రాజధాని మర్చబోమంటూ ప్రజలను నమ్మించిన వైసీపీ..
ABN, First Publish Date - 2020-08-02T17:02:12+05:30
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉంటుందని, మార్చబోమని..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉంటుందని, మార్చబోమని ఎన్నికల్లో ప్రజలను నమ్మించిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ఓ సామాజిక ముద్ర వేసింది. అక్కడ రాజధాని కడితే ఒక్క వర్గమే బలపడుతుందని ఆరోపిస్తూ సమగ్ర అభివృద్ధి చేస్తామంటూ మూడు రాజధానుల నినాదం ఎత్తుకుంది. భూముల్చిన రైతులు ఈ రాజకీయంలో అన్యాయమైపోయారు.
ఏపీలో మళ్లీ ప్రత్యేక ఉద్యమం రాకుండానే పరిపాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. పరిపాలనా రాజధానిగా విశాఖ, శాసనరాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని చెబుతోంది. విశాకు రాజ్భవన్, హెచ్వోడీలు కేటాయించారు. అంటే అమరావతిలో అసెంబ్లీ తప్ప ఏమీ ఉండదు. సీఆర్డియే చట్టాన్ని రద్దు చేసినా అమరావతి, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ను ఏర్పాటు చేసి రాజధాని రైతులకు ప్యాకేజీ ప్రకటిస్తామని, నచ్చని రైతులకు భూములు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నామని అసెంబ్లీలో మంత్రి బుగ్గన ప్రకటించారు.
Updated Date - 2020-08-02T17:02:12+05:30 IST