చీరాల నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల బాహాబాహీ
ABN, First Publish Date - 2020-05-30T20:50:01+05:30
చీరాల నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల బాహాబాహీకి దిగారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో వైసీపీ నేతలు కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.
ప్రకాశం: చీరాల నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల బాహాబాహీకి దిగారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో వైసీపీ నేతలు కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గ్రామ కాపును ఎన్నుకునే విషయంలో వారం రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగుతోంది. రామలింగయ్య స్థలంలో రాజారావుకు చెందిన కర్రలను తీయమనటంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
Updated Date - 2020-05-30T20:50:01+05:30 IST