బాబు సవాల్ను జగన్ స్వీకరించాలి : యనమల
ABN, First Publish Date - 2020-08-03T23:42:43+05:30
ఏపీ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి
అమరావతి : ఏపీ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేసిన విషయం విదితమే. అంతేకాదు ఈ సవాల్కుగాను జగన్కు 48 గంటల సమయం ఇచ్చారు. జగన్ స్పందించకపోతే 48గంటల తర్వాత మళ్లీ మీడియా ముందుకొస్తానని కూడా బాబు చెప్పుకొచ్చారు. ఈ సవాల్పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు స్పందించారు. చంద్రబాబు సవాల్ను జగన్ స్వీకరించాలని ఆయన చెప్పారు.
అసెంబ్లీని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని.. రాజధాని అనేది రాష్ట్ర ప్రజల సమస్య అని యనమల మీడియా ముఖంగా తెలిపారు. జగన్ మోసం వల్ల 13 జిల్లాల అభివృద్ధి కుంటుపడుతోందని.. భవిష్యత్ తరాలు దెబ్బతినబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. జగన్ తుగ్లక్ పాలన నుంచి ఏపీని రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని యనమల పిలుపునిచ్చారు.
Updated Date - 2020-08-03T23:42:43+05:30 IST