ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కధల’ కొలను సదానంద ఇక లేరు

ABN, First Publish Date - 2020-08-25T23:17:18+05:30

ప్రముఖ రచయిత కలువకొలను సదానంద(81) మంగళవారం ఉదయం 11గంటలకు కన్నుమూసారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత కలువకొలను సదానంద(81) మంగళవారం ఉదయం 11గంటలకు కన్నుమూసారు. ఆయన 1939లో పాకాలలో జన్మించారు. కాగా పాకాలలోనే ఆయన చివరి శ్వాస విడిచారు. ఆయనకధ,నవల, కవిత్వం ముఖ్యంగా గేయాలు వంటివి వివిధ ప్రక్రియల్లో రచనలుచేశారు. రచయితగానే కాకుండా చిత్రకారుడిగా ,కార్టునిస్టుగా కూడా ఆయన తెలుగు ప్రజలకు సుపరిచితులు. రక్తయజ్ఞం, పైరుగాలి, నవ్వేపెదవులు, ఏడ్చే కళ్లు మొదలైనవి వీరి కథా సంపుటాలు. గాడిద బతుకులు,గందరగోళం, బంగారుమామ వంటి నవలలు రాశారు.


కేంద్ర ప్రభుత్వం నుంచి 1992లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా సత్కారాన్ని పొందారు. ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సత్కారాన్నీ ఆయన పొందారు. ఎవరికోసం చెబుతున్నారో వారి చెంతకే వెళ్లి చెబుతున్నట్టుగా ఉంటుంది ఆయన శైలి. కపటం, మొహమాటం ఉండదు. మినహాయింపులు కూడా ఉండవు. చెప్పదల్చుకున్నది వీలైనంత వినయంగా, కళాత్మకంగా చెబుతారు. ఉత్తమ రచయితగానే కాదు ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు పొందారు. 

Updated Date - 2020-08-25T23:17:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising